మళ్లీ ఊపందుకున్న గుంటూరు ప్రాజెక్ట్! 900 మీటర్లకు పైగా విస్తరణ! భూముల ధరలకు రెక్కలు!
Mon Apr 21, 2025 12:44 Politics.202504210195.jpg)
గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా శంకర్ విలాస్ పైవంతెన (ఆర్వోబీ) నిర్మాణానికి భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నందివెలుగు బ్రిడ్జి ప్రాజెక్టు మొదట 2014లో మంజూరై, 2017లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ వైసీపీ పాలన సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తిగా మూలనపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు పునఃప్రారంభమై వేగంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తక్కువ వ్యవధిలోనే శంకర్ విలాస్ వంతెన ప్రాజెక్టును తిరిగి ప్రాప్తి చేసింది.
ఇది కూడా చదవండి: టీడీపీ పెద్దాయనకు గవర్నర్ పోస్టు రెడీ! త్వరలో అధికారిక ప్రకటన!
కేంద్రమంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, “ఇలాంటి ప్రాజెక్టు ముందుకు సాగడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది, ఇది అందుకు జ్వలంత ఉదాహరణ,” అని చెప్పారు. కొంతమంది కావాలని ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమని, వాస్తవాలను తెలుసుకోమని పిలుపునిచ్చారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేకసార్లు సంప్రదింపులు జరిగాయని తెలిపారు. వంతెన నిర్మాణాన్ని అడ్డుకోవడం కొందరి ఆలోచనగా అభిప్రాయపడ్డారు. మొదట 430 మీటర్లుగా రూపొందించిన బ్రిడ్జిని ఇప్పుడు 900 మీటర్లకు పైగా విస్తరించామని, రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వంతెనను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోదని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
శంకర్ విలాస్ పైవంతెన (ఆర్వోబీ) విస్తరణ ప్రాజెక్టు గుంటూరులో వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రాజెక్టు పూర్తవుతున్న కొద్దీ ట్రాఫిక్ సమస్యలు తగ్గడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వలన వాణిజ్య మరియు నివాస స్థలాల విలువ పెరుగుతోంది. వంతెన ద్వారా పట్టణానికి మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతున్నందున వ్యాపార వ్యాప్తి అవకాశాలు కూడా పెరిగాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా డిమాండ్ నెలకొంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapradesh #andhrapravasi #ShankarVilasBridge #GunturDevelopment #UrbanGrowth #BridgeToFuture #SmartGuntur
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.